Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాధిని తవ్వి తలను తీసుకెళ్ళారు.. ఎందుకు..?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (16:52 IST)
దొడ్డబళ్లాపురంలోని ఓ గ్రామ నివాసి చనిపోయి 2 నెలలు పూర్తయ్యింది. ఆ శవాన్ని తవ్వి తలను మాత్రం తీసువెళ్లారట. ఈ ఘటన నెలమంగల తాలుకా భైరనపహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. వీటి వివరాల్లో వెళ్తే..
 
శ్మశానంలో పూడ్చి పెట్టున్న శవాన్ని బయటకు తీసిన దుండగులు.. తలను మాత్రం తీసుకుపోయారు. ఆ శవం ఎవరిదని చూస్తే.. భైరనహళ్లి గ్రామం నివాసి అరసయ్య వయోభారంతో జనవరి 13న మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని శ్మశానంలో పూడ్చిపెట్టారు. అయితే.. మంగళవారం నాడు అంటే.. మార్చి 5వ తేదీన రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పూడ్చున్న శవాన్ని తవ్వి బయటకు తీసి తలను మాత్రం కత్తిరించుకుని వెళ్లిపోయారు.
 
బుధవారం నాడు శ్మశానం వైపు వెళ్లిన స్థానికులు తలలేని శవాన్నిచూసి భయాందోళనకు గురయ్యారు. దాంతో ఏం చేయాలో తెలియక.. వెంటనే నెలమంగల రూరల్ పోలీసులకు ఈ ఘటన గురించి తెలియజేశారు. తక్షణమే పోలీసులకు శ్మశానానికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులు మొండాన్ని తిరిగి పూడ్చి పెట్టారు. బుధవారం ( మార్చి 6) అమావాస్య కావడంతో చేతబడి కోసమే మాంత్రికులు ఈ చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments