Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండురోజులకే సంచలనం నిర్ణయం తీసుకున్న కర్ణాటక సిఎం.. ఏంటది?

Webdunia
బుధవారం, 31 జులై 2019 (17:52 IST)
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రెండురోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు యడ్యూరప్ప. టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 10వ తేదీన టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
అయితే ఈ జయంతి వేడుకలను బిజెపి ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. కర్ణాటకలో టిప్పు జయంతి రోజులు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని అంటోంది బిజెపి. అందుకే రద్దు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. 2016 నుంచి టిప్పు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. 
 
గత యేడాది టిప్పు జయంతి వేడుకల సంధర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ పట్టుబట్టి మరీ వేడుకలను నిర్వహించారు అప్పటి సిఎం సిద్ధరామయ్య. టిప్పు సుల్తాన్ విషయంలో తమకు చాలా అభ్యంతరాలు ఉన్నాయంటున్నారు యడ్యూరప్ప. అయితే బ్రిటీష్ వారితో పోరాడి ప్రాణత్యాగం చేసిన టిప్పు సుల్తాన్‌కు ఇలా మతం రంగు పులమడం మంచిది కాదంటున్నారు కాంగ్రెస్, జెడిఎస్ నేతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments