Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులపై వరాల జల్లు.. ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవులు

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (11:21 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మహిళా ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగినులకు ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకు రూ. 37,188 కోట్లు విడుదల చేస్తామని అయన పేర్కొన్నారు. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్ సౌకర్యం కోసం బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లోని అంగన్వాడీలను క్రీచ్‌లుగా మార్చుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ రెండు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లో క్రీచ్‌లను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 
 
''రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న మెటర్నిటీ సెలవులతో పాటు ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ సెలవును కూడా ఇస్తాం. పరిపాలనా యంత్రాంగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మహిళల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం...'' అని యడ్యూరప్ప పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments