కళ్లకురిచిలో ఘటన.. హాస్టల్‌ ప్రాంగణంలో బాలిక శవం.. ఏం జరిగింది?

Webdunia
సోమవారం, 18 జులై 2022 (16:18 IST)
Kallakurichi
తమిళనాడులో దారుణ ఘటన జరిగింది. కళ్లకురిచికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నసేలంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో షాకింగ్ సంఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక జూలై 13న హాస్టల్ ప్రాంగణంలో శవమై కనిపించింది. 
 
కాగా, బాలిక హాస్టల్‌లోని మూడో అంతస్తులోని ఓ గదిలోని బాల్కనీ నుంచి నేలపైకి దూకి తన జీవితాన్ని ముగించుకుందని అనుమానిస్తున్నారు. మరణానికి ముందు ఆమెకు గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అయితే, బాలిక చనిపోవడం వెనుక హాస్టల్ సిబ్బంది ఏవైనా ఉన్నాయా అని బాధిత బాలిక బంధువులు అనుమానించారు.
 
దీంతో.. ఆదివారం గ్రామస్తులతో కలిసి మూకుమ్మడిగా పాఠశాలలో ప్రవేశించి, అక్కడి బస్సులను తగులబెట్టారు. ఆమె మరణంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె తల్లిదండ్రులు, బంధువులు, కడలూరు జిల్లా వేప్పూర్‌లోని పెరియనాసలూరు గ్రామం ప్రజలు న్యాయం చేయాలని కోరుతూ నిరంతరాయంగా నిరసనలు చేస్తున్నారు. 
 
విద్యార్థి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు 'అంతర్జాతీయ' పాఠశాల అధికారులను నిందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments