Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి చనిపోయారు... కానీ ఆయన నిర్దోషి అని నిరూపించేందుకు పోరాడిన సంతానం...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (20:34 IST)
లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ డాక్టర్ నిర్దోషి అని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కాకపోతే చాలా ఆలస్యంగా సదరు వ్యక్తికి న్యాయం లభించింది. కేసు నమోదై 32 సంవత్సరాలు గడిచిన తర్వాత కోర్టులో ఇప్పుడు ఆయన నిర్దోషిత్వం రుజువైంది. కానీ తీర్పు వినడానికి ఆయన లేరు. నాలుగేళ్ల క్రితం కాలం చేసారు. నిశికాంత్ కులకర్ణి అనే ఆ వైద్యుడు మహారాష్ట్రలోని మన్మాడ్ మునిసిపాలిటీ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. 
 
వంద రూపాయలు తీసుకుని డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని ఆయనపై 1987 సెప్టెంబర్‌లో కేసు నమోదైంది. అయితే ఓ వ్యక్తి తన సోదరుని మరణ ధృవీకరణ పత్రం కోసం నిశికాంత్ 150 రూపాయల లంచం అడిగినట్లు, చివరకు 100 రూపాయలకు బేరం కుదిరిందని ఏసీబీకి ఫిర్యాదు చేసాడు. ఈ కేసుపై సెషన్స్ కోర్టు 2005లో తీర్పు చెప్పింది. డాక్టర్‌కు ఒక ఏడాది, ప్యూనుకు ఆరునెలల శిక్ష పడింది. 
 
కాగా లంచం తీసుకుంది ప్యూను కాబట్టి నిందితులు దీనిపై హైకోర్టుకు వెళ్లారు. కేసు నడుస్తుండగానే డాక్టరు వృద్ధాప్యం వల్ల చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆయన నిర్దోషిత్వాన్ని రుజువు చేయాలనే పట్టుదలతో హైకోర్టులో కేసును కొనసాగించారు. చివరకు విజయం సాధించారు. కాగా ఆ విజయాన్ని చూసుకునేందుకు ఆ డాక్టరు లేకపోవడం విచారకరం.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments