Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పనిమనిషిపై జర్నలిస్టు అత్యాచారం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (10:54 IST)
ఇంట్లో పని చేసే పని మనిషిపై సీనియర్ జర్నలిస్టు ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని వయసు 53 యేళ్లు కాగా, ఆ పని మనిషి వయసు 25 యేళ్లు. ఈ ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఒడిషాకు చెందిన 25 యేళ్ల యువతి గురుగ్రామ్‌లో ఉన్న ఓ ఇంటిలో పాచిపని చేసుకుంటూ జీవిస్తోంది. ఈ ఇంట్లోనే 53 యేళ్ళ వ్యక్తి ఒకరు సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. అయితే, ఈ నెల 4వ తేదీన అర్థరాత్రి దాటిన తర్వాత పని మనిషి నిద్రపోతున్న గదిలోకి వెళ్ళిన జర్నలిస్టు ఆమెను అసభ్యంగా తాకి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే, అతని నుంచి తప్పించుకున్న ఆ యువతి బాత్రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుని తన మాన ప్రాణాలను కాపాడుతుంది. మరుసటి రోజు ఉదయం అక్కడ నుంచి బయటపడిన ఆమె.. తన స్నేహితురాలికి విషయం చెప్పింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏసీపీ కరణ్ గోయల్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments