Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ రాష్ట్రంలో పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్..

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (09:37 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. సూర్య నగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే, ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ చనిపోలేదు. కానీ పది మందికి గాయాలయ్యాయి. ప్రాణనష్టం లేకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంద్రా టెర్మినల్ నుంచి జోధ్‌పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ జోధ్‌పూర్ డివిజన్‌ పరిధిలోని రాజ్‌కియావస్ - బోమద్ర స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న నార్త్ వెస్టర్న్ రైల్వే అధికారులు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి.. సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 
 
మార్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికో రైలులో భారీ కుదుపు లాంటి శబ్ధం వచ్చిందని, ఆ తర్వాత రెండు మూడు నిమిషాలకే రైలు ఆగిపోయిందని ఆ రైలులో ప్రయాణం చేసిన ఓ ప్రయాణికుడు చెప్పాడు. కిందికి దిగి చూస్తే మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని వివరించాడు.

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments