Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ రాష్ట్రంలో పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్..

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (09:37 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. సూర్య నగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే, ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ చనిపోలేదు. కానీ పది మందికి గాయాలయ్యాయి. ప్రాణనష్టం లేకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంద్రా టెర్మినల్ నుంచి జోధ్‌పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ జోధ్‌పూర్ డివిజన్‌ పరిధిలోని రాజ్‌కియావస్ - బోమద్ర స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న నార్త్ వెస్టర్న్ రైల్వే అధికారులు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి.. సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 
 
మార్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికో రైలులో భారీ కుదుపు లాంటి శబ్ధం వచ్చిందని, ఆ తర్వాత రెండు మూడు నిమిషాలకే రైలు ఆగిపోయిందని ఆ రైలులో ప్రయాణం చేసిన ఓ ప్రయాణికుడు చెప్పాడు. కిందికి దిగి చూస్తే మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని వివరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments