సీఎం హేమంత్‌ సోరెన్‌పై అత్యాచార ఆరోపణలు.. లైట్‌గా తీసుకున్న బీజేపీ ఎంపీ

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (13:32 IST)
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో ఆత్యాచార ఆరోపణలు చేశారు. 2013లో సోరెన్ ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్‌ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. 
 
సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, రాంచీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఇందులో బీజేపీ ఎంపీతో పాటు ట్విట్ట‌ర్ ఇండియా, ఫేస్ బుక్ ఇండియాల‌ను కూడా చేర్చారు. 
 
త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన ఎంపీతో పాటు ఆ ఆరోప‌ణ‌ల‌ను నిర్ధారించుకోక‌ముందే త‌మ ఫ్లాట్ ఫామ్స్ నుండి తొల‌గించ‌లేద‌ని సీఎం పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఆగ‌స్టు 22న ఈ కేసులో పూర్తి స్థాయి వాద‌న‌లు కొన‌సాగ‌నున్నాయి. 
 
సీఎం ప‌రువున‌ష్టం దావాను బీజేపీ ఎంపీ లైట్‌గా తీసుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ ఎంపీ త‌న విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తూనే ఉన్నారు. మీపై ముంబైలో ఓ యువ‌తి రేప్ కేసు పెట్టింది. మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాల‌ని… నా మీద కాకుండా త‌న‌పై కేసు పెట్టాలంటూ ఎంపీ కామెంట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments