Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌మహాల్ నిర్మించిన స్థలం మాది అంటున్న బీజేపీ ఎంపీ దియాకుమారి

Webdunia
గురువారం, 12 మే 2022 (14:25 IST)
ప్రేమసౌథం తాజ్‌ మహాల్ నిర్మించిన స్థలం తమ కుటుంబానికి చెందినదని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ దియాకుమారి మీర్జా అంటున్నారు. తమదైన ఈ స్థలాన్ని అప్పట్లో షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. స్థలం స్వాధీనం చేసుకున్నప్పటికీ అప్పట్లో ఇచ్చిన పరిహారం అంతంతమాత్రమేనని అన్నారు. దీనిపై నాడు పోరాడేందుకు కోర్టులు లేవన్నారు. అదేసమయంలో తాజ్‌మహాల్ సమాధుల కింద ఏముందో తేలాలని ఈ జైపూర్ మాజీ యువరాణి అంటున్నారు. 
 
తాజ్‌మహాల్ కింద ఉన్న 22 గదులను తెరిచి, అందులో హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయేమో తేల్చాలని కోరుతూ అలహాదాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో దియా కుమారి మీర్జా స్పందించారు. తాజ్ మహాల్ నిర్మించిన స్థలం తమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
"భూమికి సంబంధించి పరిహారం ఇచ్చారు. కానీ, ఎంత మొత్తం? దీన్ని ఆమోదించిందీ లేనిదీ నేను చెప్పలేను. ఆ రికార్డులను నేను చదవలేదు. కానీ, ఆ భూమి మాత్రం మాదే. షాజహాన్ స్వాధీనం చేసుకున్నాడు. ఆ కాలంలో ఏ న్యాయస్థానాలు లేవు. అప్పీల్ చేసే అవకాశం కూడా లేదు. అందుకే రికార్డులు అధ్యయనం చేయాలి. అపుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి" అని ఆమె చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments