దీపాలు వెలిగించండి.. సమైక్యతను చాటండి.. సీఎం జగన్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (18:51 IST)
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరుణంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీలోని మర్కజ్‌ సమావేశానికి వెళ్లినవారిలో అనేకమందికి కరోనా సోకడం దురదృష్టకరమని సీఎం జగన్ అన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయని చెప్పారు. 
 
ఇలా వైరస్‌ సోకడాన్ని అనుకోకుండా జరిగిన ఘటనగానే భావించాలని చెప్పారు. కరోనా కాటుకు కులం మతం, ప్రాంతం, ధనిక, పేదా తేడా లేదని జగన్‌ పేర్కొన్నారు. కంటికి కనిపించని వైరస్‌పై మనమంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రేపు రాత్రి 9 గంటలకు వెలిగించే దీపాలు మన సమైక్యత చాటాలన్నారు.
 
అలాగే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు అందరూ ఆదివారం రోజు దీపాలు వెలిగించాలని కోరారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి దీపాలు వెలిగించాలని కోరారు. లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. కరోనా బాధితులను వింతగా చూడొద్దని.. ఆప్యాయతగా చూడాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora: చావు పుట్టుక‌ల భావోద్వేగాన్ని తెలియ‌జేసే దండోరా టీజ‌ర్‌

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments