Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో పెట్రేగిపోయిన ఉగ్రవాదులు.. కశ్మీర్ పండిట్‌పై కాల్పులు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (14:12 IST)
జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. 24 గంటల వ్యవధిలో వరుసగా 4 ఉగ్రదాడులకు పాల్పడ్డారు. తాజాగా చోటుచేసుకున్న ఘటనలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌పై కాల్పులు జరపగా, అంతకు ముందు ఘటనల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానికేతర కూలీలు, సాధారణ పౌరులపై తూటాలు పేల్చారు.  
 
ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో నాలుగు చోట్ల దాడులు జరిపారు. పుల్వామా తర్వాత రెండో ఘటన శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. శ్రీన‌గ‌ర్‌ ఉగ్రదాడి ఘ‌ట‌న‌లో ఓ సీఆర్పీఎఫ్ జ‌వాను మృతిచెందాడు. మ‌రో జ‌వాను గాయ‌ప‌డ్డాడు. భ‌ద్ర‌తా ద‌ళాల చెక్ పాయింట్ వ‌ద్ద ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా.. 24 గంటల వ్యవధిలో నాలుగో ఉగ్రదాడి ఘటన షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. షోపియాన్ జిల్లా ఛోటోగామ్‌ ప్రాంతంలో దుకాణం నిర్వహించే కశ్మీరీ పండింట్ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 
 
తీవ్రంగా గాయపడిన ఆయనను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కశ్మీరీ పండిట్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఘటనలపై అధికారులు ప్రకటన విడుదల చేయాల్సిఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments