Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భాశయ మార్పిడితో తొలి కాన్పు సక్సెస్

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (11:38 IST)
దేశంలో గర్భాశయ మార్పిడితో తొలి కాన్పు విజయవంతం అయ్యింది. గతేడాది మే నెలలో గర్భాశయ మార్పిడి చేయించుకున్న మహిళకు గురువారం పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ తరహా కాన్పు దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. బిడ్డ సాధారణ ప్రసవం ద్వారా జన్మించిందని.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన మీనాక్షీ వాలన్ అనే 28 ఏళ్ల మహిళకు గతం‌లో గర్భస్రావం జరిగి ఆమె గర్భాశయాన్ని తొలగించారు. దీంతో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది. వైద్యుల సలహా మేరకు మీనాక్షి గర్భాశయ మార్పిడి చేయించుకోవాలని నిశ్చయించుకుంది. దీని కోసం ఆమె తల్లి గర్భాశయం దానం చేశారు. 
 
అనంతరం ఆమె ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానం ద్వారా గర్భం ధరించారు. వరుసగా మూడు సార్లు గర్భస్రావం జరిగిన అనంతరం ఇప్పుడు ఆమెకు ఆడబిడ్డ జన్మించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments