సజావుగా సాగుతున్న ఆదిత్ ఎల్-1 ప్రయోణం.. రెండో కక్ష్యం పెంపు

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (13:51 IST)
దేశ తొలి సౌర అధ్యయన ఉపగ్రహం ఆదిత్య-ఎల్1 నిర్ధేశిత భూకక్ష్యలోకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఆదివారం తొలి భూకక్ష్యం పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్టు పేర్కొంది. బెంగుళూరులో ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఐఎస్టీఆర్ఏసీ) నుంచి ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిపింది. దీంతో ఆదిత్య-ఎల్1 ఇపుడు 245,22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. మిషన్ అంతా సజావుగా సాగుతోందని, రెండో భూకక్ష్య పెంపు నిర్వహించనున్నట్టు తెలిపింది. 
 
'ఆదిత్య-ఎల్ 1' ఉపగ్రహంతో పీఎస్ఎల్వీ-సి57 వాహకనౌక శనివారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనున్న 'ఆదిత్య-ఎల్1'.. అనంతరం భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్ బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఇస్రో తెలిపింది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయని పేర్కొంది. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయని, సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయని తెలిపింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments