Webdunia - Bharat's app for daily news and videos

Install App

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (14:47 IST)
నింగిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పాడెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ పోస్టు పెట్టింది. తాజాగా వీటిని 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చి.. ఆపై 3 మీటర్లకు ఈ దూరాన్ని తగ్గించింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరానికి జరిపినట్లు పేర్కొంది. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్ ప్రక్రియ చేపడతామని ఇస్రో ప్రకటించింది. 
 
అంతకుముందు స్పాడెక్స్ ఉపగ్రహాల చిత్రాలను కూడా ఎక్స్ పోస్టు చేసింది. ఆదివారం తెల్లవారు జామున 3.10 సమయంలో తొలుత ఈ ఉపగ్రహాలను 105 మీటర్ల దగ్గరికి చేర్చారు. అనంతరం అవి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. నింగిలో డాకింగ్ కోసం జంట స్పాడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అవి 'హోల్డ్' దశలో ఉన్నాయి. 
 
ఎసీఎక్స్01 (ఛేజర్), ఎసీఎక్స్ 02 (టార్గెట్) అనే ఈ రెండు ఉపగ్రహాలను గత నెల 30న పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 7, 9 తేదీల్లో వీటిని అనుసంధానం (డాకింగ్) చేసేందుకు నిర్ణయించినప్పటికీ.. వివిధ కారణాల వల్ల అది వాయిదాపడింది. ఆ ప్రక్రియ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments