Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృత జయలలిత కుమార్తెనా కాదా?: ఫిబ్రవరి 1న కోర్టులో విచారణ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత తెరపైకి వచ్చింది. గతంలో తాను జయలలిత కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మ

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (15:09 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత తెరపైకి వచ్చింది. గతంలో తాను జయలలిత కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అమృత కేసు ఈ నెల 2న విచారణకు రానుంది. 
 
ఈ కేసులో డీఎన్ఏ ఒక్కటే కావడంతో అమృత హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సీసీఎంబీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సీసీఎంబీ కోర్టు ఆదేశాల మేరకే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ కేసులో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలంటే.. అమ్మ అస్థికల డీఎన్ఏను సేకరించాలి. 
 
కానీ ఆ పని జరిగేలా కనిపించట్లేదు. దీంతో జయలలిత తోబుట్టువుల నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. డీఎన్ఏ పరీక్ష చేసి అమృతను జయలలిత కుమార్తెనా లేదా అనేది పెద్ద విషయం కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఆ పరీక్షలపై కోర్టు ఎలాంటి తీర్మానం తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments