Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన రాహుల్.. చెప్పేవన్నీ అబద్ధాలే!

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (16:22 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. అధికారంలో వున్న బీజేపీ సర్కారు అసత్యాలను వ్యవస్థీకృతం చేసిందని మండిపడ్డారు.

కరోనా వైరస్ మహమ్మారి, ఆర్థిక వ్యవస్థ, భారత్-చైనా ప్రతిష్టంభనలపై మోదీ సర్కారు అసత్యాలు చెప్తోందని  ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ ట్వీట్‌తోపాటు రాహుల్ గాంధీ ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని జత చేశారు.
 
కరోనా వైరస్ సంబంధిత మరణాలు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలపై తప్పుడు సమాచారం ఇస్తోందని రాహుల్ గాందీ ఆరోపించారు. తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ప్రతిష్టంభనపై మీడియాను కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని తెలిపారు. 
 
కోవిడ్-19 టెస్టులను పరిమితం చేశారని, మరణాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కొత్త లెక్కింపు విధానంతో జీడీపీపై అవాస్తవాలున్నాయన్నారు. ఈ భ్రమలు త్వరలోనే తొలగుతాయని, భారత దేశం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments