Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు నౌకాదళ కేంద్రం : ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ప్రత్యేకతలేంటి?

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (10:33 IST)
హిందూ మహాసముద్రంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ పేరు రక్షణ నౌకను భారత రక్షణ శాఖ తయారు చేసింది. ఈ నౌకను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. బుధవారం విశాఖ నౌకాదళంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేయనున్నారు.
 
ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక‌ను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) కంపెనీ నిర్మించింది. ఈ నౌక పొడవు 110 మీటర్లు... దీని బరువు 3,800 టన్నులు. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో ఈ నౌకకు రూపకల్పన చేశారు. వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ నౌక స్థానంలో ఈ కొత్త ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను తయారు చేశారు. 
 
18 నాటికల్ మైళ్ల వేగంతో ఏకబిగిన 25 రోజుల పాటు ప్రయాణించడం ఈ నౌక ప్రత్యేకత. హిందూ మహాసముద్రంలో చైనా నుంచి ఎదురవుతున్న వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవడంలో ఐఎన్ఎస్ నిర్దేశక్ కీలకపాత్ర పోషించనుందని రక్షణ రంగ వర్గాలు భావిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments