Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువు చెప్పిన విద్యా సంస్థకు రూ.315 కోట్ల విరాళం... ఎవరు?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (17:04 IST)
తాను చదువుకున్న విద్యా సంస్థకు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని భూరి విరాళం ఇచ్చారు. బాంబే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి ఆయన రూ.315 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విద్యా సంస్థతో తన అనుబంధం 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విరాళాన్ని ఆయన ప్రకటించారు. ఈయన 1973లో బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలో చేరారు. ఇప్పటికీ 50 యేళ్లు పూర్తయ్యాయి. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, "బాంబే ఐఐటీ నా జీవితానికి మూలస్తంభం వంటిది. నా జీవితానికి పునాది అక్కడే పడింది. అందుకే సంస్థతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకొని నా వంతు సహకారం అందిస్తున్నాను. సంస్థకు భవిష్యత్తులోనూ నా సహకారం ఉంటుంది. ఇది కేవలం ఆర్థికం సహాయం కాదు. నాకు జీవితం ఎంతో ఇచ్చిన సంస్థ పట్ల నాకున్న గౌరవం. రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దనున్న విద్యార్థుల పట్ల నిబద్ధత" అని నందన్ పేర్కొన్నారు. 
 
ఆయన ఇచ్చిన ఈ విరాళంలో సంస్థలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు, పరిశోధనలకు, టెక్ స్టార్టప్ పర్యావరణాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించనున్నారు. కాగా, గతంలోనూ ఆయన ఐఐటీ బాంబేకు రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. కేవలం ఆర్థికంగా అండగా ఉండడమే కాకుండా ఈ యాభై ఏళ్లలో పలు హోదాల్లో సంస్థతో ఆయన అనుసంధానమయ్యే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments