మరో బ్రాండ్‌కు ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (16:41 IST)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమా షూటింగులతో అత్యంత బిజీగా ఉంటున్నారు. మరోవైపు, ఆయన కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తున్నారు. ఈ క్రమలో మరో కంపెనీకి ప్రచారకర్తగా నియమితులయ్యారు. ప్రముఖ బంగారు, వజ్ర ఆభరణాల కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూవెలరీ కంపెనీకి జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. 
 
దీనికి సంబంధించి ఓ యాడ్‌ షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. ఈ యాడ్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తారని తెలిపారు. ఈ యాడ్ షూట్ నుంచి ఓ ఫోటోను తాజాగా రిలీజ్ చేశారు. గతంలోనూ ఎన్టీఆర్ ఓ సారి మలబార్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఈ తెలుగు హీరో భారీ పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం కేఎఫ్‌సీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ నియమితులైన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "దేవర" పేరుతో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉంది. అలాగే, "కేజీఎఫ్" ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఇదికాకుండా బాలీవుడ్ చిత్రం "వార్-2"లో నటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments