Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై భక్తుడు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళం

Advertiesment
donation to TTD
, మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (17:45 IST)
తిరుమల వెంకన్నకు మరోసారి భారీ విరాళాన్ని అందింది. చెన్నైకి చెందిన భక్తుడు తితిదేకి రూ. 1.02 కోట్లు విరాళం అందించాడు. ఆపదమొక్కులవాడు తిరుమల ఏడుకొండల స్వామికి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.

 
కోరిన కోర్కెలు నెరవేర్చే ఆ కలియుగదైవానికి తలనీలాలు సమర్పించి ముడుపులు చెల్లించుకుంటారు. వేంకటేశ్వరునికి భక్తితో వేసే కానుకలు వందల నుంచి కోట్లలో సమర్పించుకుంటారు భక్తులు. తాజాగా చెన్నైకి చెందిన శ్రీ సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో దాత‌లు విరాళం చెక్కును ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు.
 
ఇందులో ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.15 ల‌క్ష‌లు ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు రూ.87 ల‌క్ష‌లు విరాళం. ఈ విషయం టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-09-2022 మంగళవారం దినఫలాలు - గౌరిదేవిని ఆరాధించినా మనోసిద్ధి