Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లోని మహిళపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:16 IST)
లాక్‌డౌన్ సమయంలోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. సొంతూర్లకు వెళ్లేందుకు బస్సులు లేక క్వారంటైన్‌లో ఉన్న మహిళను సైతం కామాంధులు వదిలిపెట్టలేదు. దీనికి నిదర్శనమే క్వారంటైన్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్‌కు చెందిన ఓ మహిళ లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా లాక్‌డౌన్‌ను ఎత్తేయకపోవడంతో... కాలినడకన ఆమె సొంతూరుకు బయల్దేరింది.
 
అయితే, గురువారం రాత్రికి ఆమె మాధోపూ‌ర్‌కు చేరుకోగా... స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. దీన్ని అదనుగా తీసుకున్న ముగ్గురు వ్యక్తులు అర్థరాత్రి సమయంలో పాఠశాలకు చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై స్థానిక మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం