పెళ్లి కుమారుడు కోసం రైలును ఆపేశారు... రైల్వే మంత్రి థ్యాంక్స్ చెప్పిన వరుడి ఫ్యామిలీ

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (11:35 IST)
సాధారణంగా అత్యవసర సమయాలు లేదా వీఐపీల కోసం కొన్ని నిమిషాల పాటు రైళ్లను నిలిపివేస్తుంటారు. అయితే, ఇక్కడ ఓ పెళ్ళి కుమారుడు కోసం ఓ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకంగా మూడు గంటల పాటు నిలిపివేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాల మేరకు రైల్వే అధికారులు ఈ సాహసం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాఘ్ అనే యువకుడి వివాహం అస్సాంలోని గౌహతికి చెందిన ఓ యువతితో నిశ్చయమైంది. చంద్రశేఖర్ ఈ నెల 14వ తేదీన 34 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో బయలుదేరి 15వ తేదీన హౌరా చేరుకుని అక్కడి నుంచి గౌహతి వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు.
 
అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. వారు ఎక్కిన గీతాంజలి ఎక్స్‌ప్రెస్ రైలు మూడున్నర గంటలు ఆలస్యమైంది. ఇంత లేటుగా వెళ్తే హౌరాలో వారు ఎక్కాల్సిన సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను అందుకోలేమని, అదే జరిగితే సమయానికి గౌహతి చేరుకోలేమని భావించిన చంద్రశేఖర్ వెంటనే అత్యవసర సాయం కోసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వేశాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్ పోస్టు పెట్టాడు.
 
చంద్రశేఖర్‌కు కలిగిన అసౌకర్యానికి స్పందించిన రైల్వేశాఖ గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ వచ్చే వరకు హౌరాలో సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచాలని అధికారులను ఆదేశించింది. చంద్రశేఖర్ బృందం హౌరా చేరుకున్నాక సరైఘట్ ఎక్స్‌ప్రెస్ కదిలింది. తన పెళ్లికి సమయానికి చేరుకునేలా సహకరించినందుకు రైల్వేశాఖకు, అధికారులకు చంద్రశేఖర్ థ్యాంక్స్ చెప్పాడు.
 
అయితే, 30 మంది కోసం వందలమందిని వేచి చూసేలా చేసిన రైల్వేపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక రైలు ఆలస్యమైందని, ఇంకో రైలును ఆన్నేసి గంటలు ఆలస్యంగా నడపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలి ఎక్స్‌ప్రెస్ విషయంలో సమయపాలన పాటించడంలో విఫలమై, ఈ రకంగా క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments