Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (11:09 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత ఆదివారం నైజీరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్‌ను ప్రదానం చేసింది. అబుజలో పర్యటనలో సందర్భంగా ప్రధాని మోడకి ఈ పురస్కారానికి అందజేశారు. 
 
కాగా, ప్రధాని మోడీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెనోవో సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. విశ్వాసం, గౌరవానికి గుర్తుగా 'అబుజా సిటీ కీ'ని మోడీకి బహుకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
ఆ తర్వాత అధ్యక్షుడి భవనంలో నైజీరీయా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబుతో ప్రధాని మోడీ సమావేశమైయ్యారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా మోడీ అభివర్ణించారు. ఇది కేవలం తనకు దక్కిన గౌరవం కాదని, 140 కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
 
విదేశీ పర్యటనలో భాగంగా తొలుత నైజీరియాలో అడుగు పెట్టిన మోడీ, అనంతరం బ్రెజిల్, గుయానాలో పర్యటించనున్నారు. ఈ నెల 21 వరకూ ఆయన విదేశీ పర్యటనలో ఉంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments