Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

Advertiesment
vande bharat

సెల్వి

, గురువారం, 31 అక్టోబరు 2024 (18:28 IST)
కేరళలో వందే భారత్ రైళ్ల సరికొత్త ట్రాక్‌ల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కేరళ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన దీపావళి కానుకగా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. 
 
ఇందులో తిరువనంతపురం నుండి మంగళూరు వరకు రెండు జత రైళ్లు, తిరువనంతపురం నుండి కాసర్గోడ్ వరకు మరొకటి ఉన్నాయి. ప్రస్తుతం, మంగళూరు రైలులో ఎనిమిది కోచ్‌లు ఉన్నాయి. త్వరలో దీనికి 16 కోచ్‌లు రానుండగా, కాసర్‌గోడ్‌కు వెళ్లే ఇతర రైలులో 16 కోచ్‌లు ఉన్నాయి. 
 
తాజాగా మరో నాలుగు కోచ్‌లతో కలిపి మొత్తం 20కి చేరుకోనున్నాయి. వందే భారత్ రైలు తిరువనంతపురం నుండి మంగళూరుకు పట్టే సమయం 8 గంటల 35 నిమిషాలు, అదే మార్గంలో తదుపరి వేగవంతమైన రైలుకు 12 గంటల 50 నిమిషాలు పడుతుంది. మరో రెండు రైళ్లు దాదాపు 15 గంటలు పడుతుంది.
 
ఈ హై-స్పీడ్ సూపర్‌ఫాస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రైళ్లు భారీ విజయాన్ని సాధించాయి. ఈ రైళ్లలో టిక్కెట్ల ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు ఈ వేగవంతమైన రవాణా విధానాన్ని ఇష్టపడతున్నారు. ఈ రెండు జత రైళ్ల సక్సెస్ చూసి, బెంగుళూరు నుండి కొచ్చికి వారానికి మూడు సార్లు నడిచే మూడవ వందేభారత్ రైలు కూడా రానుంది. 
 
వందే భారత్ రైళ్లు వారి దేశంలోని అన్ని మార్గాల్లో అత్యంత వేగవంతమైన ఎంపికగా ఉన్నాయి. తొలుత ప్రారంభమైన న్యూఢిల్లీ-వారణాసి మార్గం, అత్యంత పొడవైనది అయినప్పటికీ, అత్యధిక సగటు వేగం గంటకు 95 కి.మీల రికార్డును కలిగి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

6G మొబైల్ వైపు అడుగులేసిన చైనా.. 6G Prototype.. Sub-7GHz Frequency