Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన భామలతో ఎర.. హనీ ట్రాప్.. ముగ్గురు నేవీ ఉద్యోగుల అరెస్ట్

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (11:52 IST)
భారత నౌకాదళానికి చెందిన రహస్యాలను వెల్లడించారనే అభియోగాలపై మరో ముగ్గురు నేవీ ఉద్యోగులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఇందుకు అందమైన అమ్మాయిలను పాకిస్థాన్ ఎరగవేయడమే ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. అందానికి ముచ్చటపడి.. వారికి లొంగిపోయి.. వారికి భారత నౌకాదళానికి చెందిన రహస్యాలను వెల్లడించారని అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. 
 
వీరు ముగ్గురూ విశాఖపట్నంలో నేవీ ఉద్యోగులుగా పని చేస్తున్న వారే కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో మరికొందరు నేవీ సెయిలర్స్‌ కూడా ఉన్నట్టు అనుమానాలున్నాయి. దీంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 
 
ఫేస్ బుక్ ద్వారా నేవీ ఉద్యోగులకు అమ్మాయిలను పరిచయం చేసిన పాకిస్థాన్, వారి వద్దకు అమ్మాయిలను పంపి, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను తీసి, వాటిని చూపిస్తూ బెదిరింపులకు దిగి, ఆపై నౌకాదళ సమాచారాన్ని వారి నుంచి రాబట్టుకున్నట్లు తేలింది. 
 
'ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌' నిక్ నేమ్‌తో జరిగిన ఆపరేషన్‌లో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హనీ ట్రాప్‌లో మరికొందరు సెయిలర్స్ కూడా ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments