దేశంలోనే తొలి ట్రాన్స్‌‌జెండర్‌‌ వర్సిటీ

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (12:17 IST)
దేశంలోనే తొలిసారి ట్రాన్స్‌‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీ ఏర్పాటవబోతోంది. ఉత్తరప్రదేశ్‌‌లోని కుషినగర్‌‌ జిల్లాలో ఆలిండియా ట్రాన్స్‌‌జెండర్‌‌ ఎడ్యుకేషన్‌‌ సర్వీస్‌‌ ట్రస్టు (ఏఐటీఈఎస్‌‌టీ) దీన్ని నిర్మించనుంది. వర్సిటీ కోసం ఇప్పటికే పని మొదలైందని, ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఇక్కడ చదువుకోవచ్చని, పీహెచ్‌‌డీ కూడా చేయొచ్చని ట్రస్టు ప్రెసిడెంట్‌‌ కృష్ణ మోహన్‌‌ మిశ్రా చెప్పారు. 
 
కమ్యూనిటీ మెంబర్లు పెంచుకుంటున్న ఇద్దరు చిన్నారులు వచ్చే ఏడాది జనవరి 15న వర్సిటీలో ఫస్ట్‌‌ అడ్మిషన్‌‌ తీసుకుంటారని.. ఫిబ్రవరి, మార్చి నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు.
 
వర్సిటీ వల్ల ట్రాన్స్‌‌జెండర్‌‌ కమ్యూనిటీ చదువుకునే అవకాశాలు పెరుగుతాయని, వీళ్లు విద్యావంతులై దేశానికి కొత్త దారి చూపించగలుగుతారని ఎమ్మెల్యే గంగాసింగ్‌‌ అన్నారు. 
 
వర్సిటీ ఏర్పాటుపై ట్రాన్స్‌‌జెండర్‌‌ కమ్యూనిటీ కూడా సంతోషం వ్యక్తం చేసింది. ‘వర్సిటీతో మా లైఫ్‌‌ మారిపోతుంది. చదువుతో మాక్కూడా సొసైటీలో గౌరవం పెరుగుతుంది’ అని ఆ కమ్యూనిటీ మెంబర్‌‌ గుడ్డి కిన్నార్‌‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments