Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం

వరుణ్
శుక్రవారం, 26 జనవరి 2024 (08:27 IST)
దేశ వ్యాప్తంగా 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ఈ వేడుకలు మొదలుకాగా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో  గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పరేడ్ మైదానంలో అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. 
 
మరోవైపు, 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశ రాజధాని ముస్తాబైంది. ఢిల్లీలో 70 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌ జరిగే కర్తవ్యపథ్‌ వద్దే 14 వేల మందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. కర్తవ్యపథ్‌లో 90 నిమిషాల పాటు పరేడ్‌ జరగనుంది. ఈ వేడుకల్లో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారులు పాల్గొననున్నారు. 
 
శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌తో కలిసి కర్తవ్యపథ్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు కర్తవ్యపథ్‌లోని ఆహూతులపై పూల వర్షం కురిపించనున్నాయి. 
 
గణతంత్ర దినోత్సవానికి పంచాయతీరాజ్‌ సంస్థల నుంచి పలువురు ప్రతినిధులను ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్‌ శాఖ గురువారం తెలిపింది. కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌ను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా పలు పంచాయతీ ప్రతినిధులు, వారి జీవిత భాగస్వాములు సహా 500 మందికి ఆహ్వానాలు అందించినట్లు చెప్పింది. గతంలో జాతీయ పంచాయతీ అవార్డులు పొందిన లేదా విశేష కృషి చేసిన పంచాయతీల ప్రతినిధులను ఎంపిక చేసి పరేడ్‌కు ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments