Webdunia - Bharat's app for daily news and videos

Install App

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు- పంజాబ్‌లో ఉగ్రమూకల అరెస్ట్

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (21:48 IST)
Punjab
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉగ్రవాద దాడులు, విధ్వంసాలను నివారించడానికి అన్ని రాష్ట్రాల పోలీసులు,  సైన్యం తీవ్రంగా కృషి చేస్తున్నారు. 
 
దేశ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ఆ విధంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఐదు మందిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పంజాబ్ పోలీసులు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కలిసి ఈ అరెస్టు చేశారు. ఈ ఐదుగురు వ్యక్తులు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు హర్విందర్ రిండా, అమెరికాకు చెందిన గోల్డీ బ్రార్‌ల కార్యకర్తలు అని తేలింది.
 
వీరు రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యంగా విధ్వంసం చేసేందుకు పక్కా ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా వారి నుంచి రెండు విదేశీ పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు. వారిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే సోమవారం పంజాబ్‌లోని డార్న్ దారన్ ప్రాంతంలో ఉగ్రవాద ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments