Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా మహమ్మారికి 40 లక్షల మంది మృతి?

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (13:32 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ఏకంగా 40 లక్షల మంది చనిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కరోనా మరణాలను లెక్కించే విధానాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. 
 
తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే.. భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్ విషయంలోనూ పాటించడం సరికాదని వ్యాఖ్యానించింది. "అంతర్జాతీయంగా కరోనా మరణాలను బహిర్గతం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటోంది" అంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
దీనిపై కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ ధీటుగా స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలు అధికారికంగా ప్రకటించిన గణాంకాలతో పోలిస్తే కరోనా మరణాలు 1.5 కోట్లు అధికంగా ఉంటాయని డబ్ల్యూహెచ్ వో అంచనా. దేశాలన్నీ ప్రకటించిన మరణాల కంటే ఇది రెట్టింపు. భారతదేశంలో మరణాలు కనీసం 40 లక్షలుగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 
 
అయితే, ప్రపచం ఆరోగ్య సంస్థ ప్రకటించిన మరణాల సంఖ్యపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. కానీ, మరణాల లెక్కింపునకు అనుసరించిన విధానాన్ని మాత్రం భారత్ తప్పుబడుతుంది. 
 
చైనా, బంగ్లాదేశ్, ఇరాన్ సిరియా సైతం మరణాల లెక్కింపునకు అనుసరించిన విధానాన్ని ప్రశ్నించాయి. ఏవో కొద్ది శాంపిల్ సైజు వివరాలతో మరణాలను అంచనా కట్డడం ట్యునీషియా వంటి చిన్న దేశాలకు చెల్లుతుందేమో కానీ, 130 కోట్ల మంది ఉన్న భారత్ వంటి పెద్ద దేశాలకు కాదు. భారత్ నమూనా ఖచ్చితత్వంతో కూడుకున్నది అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments