Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (10:01 IST)
దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అత్యాచారాల రాజధానిగా భారత్ మారిందంటూ ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న లైంగికదాడుల ఘటనలను చూసి ప్రపంచ సమాజం భారత్‌ను 'రేప్‌లకు రాజధాని' అంటూ ఎద్దేవా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తన లోక్‌సభ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో మూడు రోజులు పర్యటనను ముగించుకున్న రాహుల్‌ శనివారం ఓ సదస్సులో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ రాజకీయ జీవితమంతా ద్వేషం, విభజన, హింసపై ఆధారపడి ఉన్నదని విమర్శించారు. 'ప్రతి రోజు ఓ యువతి లైంగికదాడికి లేదా హత్యకు గురైందన్న వార్తను చదివినప్పుడు తల్లులు, అక్కాచెల్లెళ్లు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంతర్జాతీయ సమాజం నేడు భారత్‌ను చూసి అవహేళన చేస్తున్నది. భారత్‌ను లైంగికదాడులకు రాజధాని అని ఎద్దేవా చేస్తున్నది' అంటూ వ్యాఖ్యానించారు. 
 
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగర్‌పై నమోదైన లైంగిక దాడి కేసును ప్రస్తావిస్తూ, 'బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడినా ప్రధాని పెదవి విప్పరు. బాధితురాలు, ఆమె బంధువులు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొన్నా ప్రధాని మాట్లాడరు. మీ కుమార్తెలను మీరెందుకు కాపాడుకోలేకపోతున్నారని విదేశాలు మనలను ప్రశ్నిస్తున్నాయి' అంటూ రాహుల్ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం