Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (10:01 IST)
దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అత్యాచారాల రాజధానిగా భారత్ మారిందంటూ ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న లైంగికదాడుల ఘటనలను చూసి ప్రపంచ సమాజం భారత్‌ను 'రేప్‌లకు రాజధాని' అంటూ ఎద్దేవా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తన లోక్‌సభ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో మూడు రోజులు పర్యటనను ముగించుకున్న రాహుల్‌ శనివారం ఓ సదస్సులో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ రాజకీయ జీవితమంతా ద్వేషం, విభజన, హింసపై ఆధారపడి ఉన్నదని విమర్శించారు. 'ప్రతి రోజు ఓ యువతి లైంగికదాడికి లేదా హత్యకు గురైందన్న వార్తను చదివినప్పుడు తల్లులు, అక్కాచెల్లెళ్లు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంతర్జాతీయ సమాజం నేడు భారత్‌ను చూసి అవహేళన చేస్తున్నది. భారత్‌ను లైంగికదాడులకు రాజధాని అని ఎద్దేవా చేస్తున్నది' అంటూ వ్యాఖ్యానించారు. 
 
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగర్‌పై నమోదైన లైంగిక దాడి కేసును ప్రస్తావిస్తూ, 'బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడినా ప్రధాని పెదవి విప్పరు. బాధితురాలు, ఆమె బంధువులు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొన్నా ప్రధాని మాట్లాడరు. మీ కుమార్తెలను మీరెందుకు కాపాడుకోలేకపోతున్నారని విదేశాలు మనలను ప్రశ్నిస్తున్నాయి' అంటూ రాహుల్ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం