Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై విశ్వాసం కోల్పోయిన కాశ్మీరీలు.. యశ్వంత్ సిన్హా

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నిన్నటికినిన్న ప్రధాని మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనా

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (10:43 IST)
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నిన్నటికినిన్న ప్రధాని మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉందంటూ సంచలన విమర్శలు చేశారు. 
 
ఇపుడు జమ్మూకాశ్మీరు సంక్షోభంపై కేంద్రం తీరును తప్పుబట్టారు. భావోద్వేగపరంగా కాశ్మీరీలను భారత్‌ కోల్పోయిందన్నారు. వారు భారత్‌పై విశ్వాసం కోల్పోయారని అభిప్రాయపడ్డారు. ప్రముఖ జర్నలిస్టు కరణ్‌ థాపర్‌ ‘ది వైర్‌’ చానల్‌ కోసం యశ్వంత్‌తో ముఖాముఖి మాట్లాడారు.
 
కన్సర్న్‌డ్‌ సిటిజెన్స్‌ గ్రూప్‌ (సీసీజీ)నకు యశ్వంత్ సిన్హా నేతృత్వం వహిస్తున్నారు. ఈ గ్రూపు కొంతకాలం కింద కాశ్మీరు వెళ్లి వివిధ వర్గాల ప్రజలు, వేర్పాటువాదులతో చర్చించింది. అపుడు ఎదురైన అనుభవాలను ఆయన ఇపుడు బహిర్గతం చేశారు. 
 
‘కాశ్మీరీలు భారత్‌కు దూరం కావడం నాకు ఆందోళన కలుగజేస్తోంది. మనం అక్కడకు వెళ్లి చూస్తే మనపై వారికి విశ్వాసం పోయిందని తెలుస్తుంది. దీనిపై చర్చించేందుకు ప్రధానిని అపాయింట్‌మెంట్‌ కోరాను. పదినెలలు గడిచినా ఆయన ఇంతవరకు స్పందించలేదు’ అని వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments