Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన భారత్.. పార్శిళ్లు.. మెయిల్స్ నిలిపివేత!

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (19:36 IST)
పాకిస్థాన్‌కు భారత్ మరో షాకిచ్చింది. దాయాది దేశం నుంచి వచ్చే అన్ని రకాల పార్శిళ్లు, మెయిల్స్‌ మార్పిడిని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వాయు మార్గం లేదా ఉపరితల మార్గం ద్వారా వచ్చినా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. 
 
ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జరిగే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెల్సిందే. తాజాగా తీసుకున్న మెయిల్స్, పార్శిళ్ళ నిలిపివేతపై నిర్ణయం ఈ ఆంక్షల పరంపరలో ఒకటిగా చెప్పొచ్చు.
 
అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య సముద్ర మార్గ రవాణాను కూడా భారత్ మూసివేసింది. పాకిస్థాన్ జెండాతో ప్రయాణించే ఏ నౌక అయినా భారత్ ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. అదేసమయంలో భారతీయ నౌకలు కూడా పాకిస్థాన్ ఓడరేవులకు వెళ్లకూడని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఆంక్షలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
కాగా, పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా ఇప్పటికే నిషేధం అమల్లో ఉంది. వీటితో పాటు పాకిస్థాన్‌కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని కూడా పరిమితం చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వీటిపై కూడా ఆంక్షలు విధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకులను కాల్చివేసిన విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments