ఇటీవలికాలంలో నేటి యువతకు సోషల్ మీడియా పిచ్చి బాగా ముదిరిపోతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ఫాలోయర్ల సంఖ్యను పెంచుకనేందుకు వివిధ రకాలైన వీడియోలో, రీల్స్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫాలోయర్ల సంఖ్య తగ్గితే వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడిని అధికమించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఇన్ప్లుయెన్సర్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. ఆమె పేరు మిషా అగర్వాల్.
సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఒకటైన ఇన్స్టాగ్రామ్లో ఫాలోయర్స్ తగ్గారని ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన 25వ పుట్టిన రోజు వేడుకకు రెండు రోజుల ముందు ఆమె లక్నోలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మరణానికి సంబంధించిన వివరాలను ఇన్స్టాగ్రామ్లో ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. మిషా ఇన్స్టాగ్రామ్లో ఫాలోయర్ల సంఖ్య తగ్గడంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకుగురై ఈ విషాదకర నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.