Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత భూభాగంలోకి చైనా జవాన్.. ఇవాళ డ్రాంగన్ కంట్రీకి అప్పగింత

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (14:07 IST)
చైనాకు చెందిన జవాన్ భారత భూభాగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారత బలగాలు ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికుడు లఢాక్‌లోని ఎల్ఏసీ వద్ద సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చాడు. అలా భారత భూభాగంలోకి వచ్చిన చైనా జవాన్‌ను ఆ దేశ సైన్యానికి ఇండియన్ ఆర్మీ ఇవాళ తిరిగి అప్పగించింది.
 
అంతకుముందు తమ సైనికుడు అదృశ్యమైనట్టు చైనా ఆర్మీ శనివారం ప్రకటించింది. ఆ తర్వాత తమ భూభాగ పరిధిలోకి వచ్చినందున ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. 
 
మొత్తానికి సోమవారం ఉదయం సరిహద్దులోని చూషుల్ - మోల్దో వద్ద సైనికుడిని చైనా సైన్యానికి భారత బలగాలు అప్పగించాయి. గాల్వన్ ఘర్షణల తర్వాత పీఎల్ఏ సైనికులు భారత భూభాగ పరిధిలోకి రావడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్‌లో కూడా పీఎల్ఏ సైనికుడు లఢాక్ వద్ద భారత భూభాగంలోకి ప్రవేశించాడు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments