Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహమైన నెల రోజులకే భార్య మెడకు నైలాన్ తాడు బిగించి ఉరేసిన భర్త!

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (13:49 IST)
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహమైన నెల రోజులకే కట్టుకున్న భర్త కసాయిగా మారిపోయాడు. పడక గదిలో ఏర్పడిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరి బిగించి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లా వ‌సాయ్ ఏరియా తులింజ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధికి చెందిన 24 యేళ్ళ వ్యక్తి గ‌త డిసెంబ‌ర్ 7న అదే జిల్లాకు చెందిన 28 ఏండ్ల మ‌హిళ‌ను అత‌డు వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, పెండ్ల‌యిన కొన్ని రోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఎప్ప‌టిలాగే ఆదివారం రాత్రి కూడా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రగ‌డంతో భర్త భార్య మెడ‌కు నైలాన్ తాడుతో ఉరిబిగించి చంపేశాడు. 
 
మృతురాలి సోద‌రుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి త‌ర‌లించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments