Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ రామ్ లీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి మెగా ర్యాలీ

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (10:39 IST)
ఢిల్లీలోని రామ్ లాలీ మైదాన్ వేదికగా ఇండియా కూటమి మెగా ర్యాలీని నిర్వహిస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ మెగా ర్యాలీ ద్వారా సత్తా చాటేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఈ మెగా ర్యాలీని చేపడుతున్నరు. ఆమె ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ సహా దాదాపు 28 మంది పార్టీల నేతలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పార్టీల నేతలు ఢిల్లీ చేరుకున్నారు. విపక్షాలు ఈ మెగా ర్యాలీలో ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్టు, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల జప్తు వంటి అనేక అంశాలను ప్రస్తావించనున్నారు.
 
ఈ ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, భగవంత్ మాన్, చంపాయ్ సోరెన్, మమతా బెనర్జీ ప్రతినిధులు పాల్గొంటారని ఆప్ నేత గోపాల్ రాయ్ తెలిపారు. డీఎంకే ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, వామపక్షాల ప్రముఖ నేతలు కూడా హాజరుకానున్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఈ ర్యాలీకి వేలాది మంది ప్రజలు తరలిరానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ భార్య సునీతా కేజ్రివాల్ కూడా రాంలీలా మైదాన్‌లో జరుగనున్న ఇండియా అలయన్స్ ర్యాలీలో పాల్గొనున్నారు. కేజీవాల్ అరెస్టు తర్వాత సునీత బహిరంగంగానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments