Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌ను తక్షణం ఖాళీ చేయండి : భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (07:29 IST)
ఉక్రెయిన్ దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించేందుకు రష్యా సేనలు సర్వసిద్ధంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యాలను అత్యాధునిక అస్త్రాలను ఎక్కుపెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ కారణంగా ఉక్రెయిన్ - రష్యాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదు. 
 
దీంతో ఉక్రెయిన్‌లో భారత పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాల్సిందిగా కేంద్రం హెచ్చరిక చేసింది. అత్యవసరమైతే మినహా ఉక్రెయిన్‌లో ఉండొద్దని కోరింది. విద్యార్థులతో సహా భారతీయులంతా అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టెర్డ్ విమానాల్లో ఉక్రెయిన్ నుంచి బయటపడాలని పేర్కొంది. 
 
ముఖ్యంగా, విద్యార్థులు స్టూడెంట్ ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుండాలని, తాజా సమాచారం కోసం భారత హైకమిషన్‌ సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికపుడు పరిశీలిస్తుండాలని సూచన చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని, ఏ క్షణమైనా రష్యా విరుచుకుపడే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల ఆ దేశంలోని భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. తక్షణం ఆ దేశాన్ని వీడాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments