Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ వెంట నటుడు ప్రకాష్ రాజ్: పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారా?

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (21:12 IST)
ఫోటో కర్టెసి-koo
వచ్చే 2024 ఎన్నికల్లో భాజపాను చిత్తుచిత్తుగా ఓడించాలనీ, ప్రధాని మోదీని గద్దె దించాలంటూ పిలుపునిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భాజపా వైరివర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో శనివారం నాడు సమావేశమయ్యారు.

 
ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్‌లతో నటుడు ప్రకాష్ రాజ్ సమావేశం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ ముగిసాక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు.

 
కేసీఆర్ మాట్లాడుతూ..“భారతదేశం కొత్త ప్రణాళికలు, కలలతో ముందుకు వెళ్లాలి. ఈ విషయమై శరద్ పవార్‌తో మాట్లాడాను. ఆయన ఎంతో అనుభవజ్ఞుడు. ఆయన నన్ను ఆశీర్వదించారు. కలిసి పని చేస్తాం. ఇతర భావసారూప్యత గల పార్టీలతో త్వరలో సమావేశాలు జరుగుతాయి. జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణపై జరుగుతున్న సమావేశంలో నటుడు ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. దీంతో ఆయన ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నారు.

మరోవైపు తెలంగాణలో ఏదో ఒక పార్లమెంటు స్థానం నుంచి ప్రకాష్ రాజ్ తెరాస నుంచి పోటీ చేస్తారంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ప్రకాష్ రాజ్ నిర్ణయం ఏంటో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments