Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన సిలిండర్ ధరలు

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (16:02 IST)
సబ్సిడీయేతర సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 19 పెంచుతూ ఐఓసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు నేటినుంచి అంటే జనవరి1, 2020 నుంచి అమలులోకి వస్తాయి.

గత అయిదు నెలలుగా సబ్సిడీయేతర సిలిండర్ ధరలు ప్రతినెల పెరుగుతూనే వస్తున్నాయి. గత ఆగష్టు నుంచి ఇప్పటివరకు సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 140 పెరిగింది.
 
ఢిల్లీ మరియు ముంబైలలో, సబ్సిడీయేతర సిలిండర్‌కు వరుసగా రూ .19 మరియు రూ .19.5 చొప్పున పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. జనవరి 1 నుంచి సబ్సిడీయేతర సిలిండర్‌కు ఢిల్లీలో రూ .714, ముంబైలో రూ .684.50గా మారిందని ఐఓసీ తెలిపింది.

ఈ ధరలు డిసెంబరులో వరుసగా రూ. 695 రూపాయలు మరియు రూ. 665 రూపాయలుగా ఉన్నట్లు ఐఓసీ తెలిపింది. కోల్‌కతాలో రూ. 21.5 పెంచి సిలిండర్ ధర రూ. 747గా సవరించారు. చెన్నైలో రూ .74 పెంచి సిలిండర్ ధర రూ .734 సవరించారు.
 
డిసెంబర్ 1, 2019 నుంచి 19 కిలోల సిలిండర్ల ధరలను ఢిల్లీలో యూనిట్‌కు రూ .1,241కు, ముంబైలో రూ .1,190 కు సవరించారని ఇండియన్ ఆయిల్ తెలిపింది. ప్రస్తుతం 14 కేజీల సిలిండర్లు సంవత్సరానికి 12 సిలిండర్ల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది. సంవత్సరానికి 12 సిలిండర్ల కోటాపై ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తం ప్రతినెలా మారుతూ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments