Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారమైన గోమూత్రం.. పాల ధర కంటే అధికం...

రాజస్థాన్ రాష్ట్ర రైతుల పాలిట గోమూత్రం బంగారంగా మారింది. ఫలితంగా లీటరు గోమూత్రం ధర రూ.30 నుంచి 50 రూపాయల ధర పలుకుతోంది. ఆవు పాల కంటే మూత్రం ధర అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (14:15 IST)
రాజస్థాన్ రాష్ట్ర రైతుల పాలిట గోమూత్రం బంగారంగా మారింది. ఫలితంగా లీటరు గోమూత్రం ధర రూ.30 నుంచి 50 రూపాయల ధర పలుకుతోంది. ఆవు పాల కంటే మూత్రం ధర అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సాధారణంగా పుణ్యకార్యాల్లో గోమూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే, సేంద్రీయ వ్యవసాయంతో రాష్ట్రంలో ఆవు మూత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్కడి రైతులు హోల్‌సేల్ మార్కెట్లో గిర్, థార్పార్కర్ వంటి హైబ్రీడ్ ఆవుల మూత్రాన్ని లీటర్ రూ.15-30కి అమ్ముతున్నారు. 
 
రైతులకే అంత ధర వస్తుంటే వ్యాపారులు అదే మూత్రాన్ని లీటర్ రూ.30-50కి విక్రయిస్తున్నారు. అదే లీటర్ పాల ధర రూ.22-25 వరకు గిట్టుబాటు అవుతుండటంతో రాజస్థాన్ రైతులు గోమూత్రం అమ్మడమే జీవన వృత్తిగా మారుతున్నారు. 
 
ఆవు పాలతో పాటు గోమూత్రం కూడా అమ్మడంతో ఒక్కో పాడి రైతు కనీసం 30 శాతం ఆదాయ పెరుగుదలను కళ్ల జూస్తున్నాడు. సేంద్రీయ వ్యవసాయం చేసేవారు గోమూత్రాన్ని పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ఇది కాకుండా ఔషధాల్లో, పూజాదికాల్లో కూడా గోమూత్రాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments