Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ప్రధానికి కరోనా భయం పట్టుకుంది.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (09:44 IST)
పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖురేషీ కరోనా వైరస్ బారిన పడటంతో.. పాకిస్థాన్ ప్రధాన మంత్రికి కరోనా భయం పట్టుకుంది. గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాక్ అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో పాకిస్థాన్ ప్రధానికి కరోనా భయం పట్టుకుంది. 
 
కరోనా పాజిటివ్‌గా తేలిన అసద్‌.. రెండు రోజుల క్రితం ఇమ్రాన్‌ కలవడమే ఇందుకు కారణం. దీంతో ముందస్తు జాగ్రత్తంగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక స్పీకర్ ఖురేషీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు.
 
మరోవైపు స్పీకర్‌ ఎవరెవరిని కలిశారు అనేది గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. ఆయనకు దగ్గరగా మెలిగిన వారిని గుర్తించి క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. కాగా ఇమ్రాన్‌కు ఇదివరకే ఓసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది. ఇక పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పాకిస్థాన్‌లో 16,353 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.
 
పవిత్ర రంజాన్‌ మాసం కావడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments