Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

జూన్ నెల వరకు లాక్ డౌన్ పొడిగింపు.. బ్రిటన్ ప్రధాని బోరిస్

Advertiesment
Boris Johnson
, గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:06 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల రక్షణార్థం జూన్ నెల వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కరోనా వ్యాధికి గురై.. చికిత్స పొంది కోలుకున్న అనంతరం, సుమారు పదిహేను రోజులుగా పాలనాపరమైన బాధ్యతలకు దూరంగా ఉన్న ఆయన గురువారం మొదటిసారిగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. 
 
బ్రిటన్ దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని పలువురు మంత్రులు ఆయనను కోరారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన పక్షంలో వేలాది కరోనా రోగులు మృత్యు బాట పట్టవచ్చునని, కరోనా మరింతగా విజృంభించే సూచనలు ఉన్నాయని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం వద్దు.. ఓపిక పట్టండని బ్రిటన్ పౌరులకు ప్రధాని సందేశం ఇచ్చారు. కరోనా కట్టడికి చేసేది ఏమిలేక స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయనే విషయాన్ని బ్రిటన్ ప్రధాని గుర్తు చేశారు.  
 
తాజాగా బ్రిటన్ దేశం జూన్ వరకు లాక్ డౌన్‌ను పొడిగించినట్టు ప్రకటించింది. కాగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇదొక్కటే మార్గంగా దేశాలన్నీ లాక్ డౌన్ విదానాన్నే అమలు చేస్తున్నాయి. దాదాపు 120 దేశాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు ఈ స్వీయ నియంత్రిణ ఆయుధాన్నే వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ కుట్ర.. ఆ యాప్ ద్వారా ఆర్మీ అధికారుల ఫోన్ హ్యాక్‌ చేస్తుందా?