Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు శుభవార్త చెప్పిన ఐఎండీ... స్మార్ట్ ఫోన్ అవసరం లేదు.. ఎస్ఎంఎస్ ద్వారా?

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (13:44 IST)
రైతులకు శుభవార్త. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం భారత వాతావరణ శాఖ రైతులకు మరింత సాయం చేసేందుకు రెడీ అవుతోంది. 
 
రైతులకు స్థానిక భాషల్లో ఎస్ఎమ్ఎస్ ద్వారా వాతావరణ సూచనను అందించే స్కీమ్‌పై ఐఎండీ రెడీ అవుతోంది. ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ సేవ కోసం హెల్ప్ లైన్ నంబర్ జారీ చేయనున్నారు.
 
ప్రాంతీయ స్థాయిలో వాతావరణ సంబంధిత సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రైతులు ఎరువులు, ఇతర ఇన్‌పుట్‌ల వినియోగం, నీటిపారుదల వంటి వ్యవసాయ కార్యకలాపాలపై తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సాధారణ పౌరులు కూడా కామన్ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి తమ ప్రాంతంలో వాతావరణ సూచనను తెలుసుకోవచ్చు.
 
దేశంలోని ఏ ప్రాంతమైన రైతు తన గ్రామం లేదా బ్లాక్ కోసం రాబోయే ఐదు రోజులలో వర్షం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం వంటి వాతావరణ సమాచారాన్ని పొందవచ్చు. ఐఎండీ ప్రత్యేక బృందం ఈ అప్లికేషన్‌పై పని చేస్తుంది.
 
ప్రస్తుతం రైతులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం కారణంగా వారు వాతావరణ సంబంధిత సమాచారాన్ని పొందలేరు. తాజా కొత్త పథకం కింద అందించే సమాచారం ఆ ప్రాంతానికి మరింత నిర్దిష్టంగా ఉంటుంది. తద్వారా ఇది రైతుకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments