Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు శుభవార్త చెప్పిన ఐఎండీ... స్మార్ట్ ఫోన్ అవసరం లేదు.. ఎస్ఎంఎస్ ద్వారా?

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (13:44 IST)
రైతులకు శుభవార్త. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం భారత వాతావరణ శాఖ రైతులకు మరింత సాయం చేసేందుకు రెడీ అవుతోంది. 
 
రైతులకు స్థానిక భాషల్లో ఎస్ఎమ్ఎస్ ద్వారా వాతావరణ సూచనను అందించే స్కీమ్‌పై ఐఎండీ రెడీ అవుతోంది. ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ సేవ కోసం హెల్ప్ లైన్ నంబర్ జారీ చేయనున్నారు.
 
ప్రాంతీయ స్థాయిలో వాతావరణ సంబంధిత సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రైతులు ఎరువులు, ఇతర ఇన్‌పుట్‌ల వినియోగం, నీటిపారుదల వంటి వ్యవసాయ కార్యకలాపాలపై తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సాధారణ పౌరులు కూడా కామన్ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి తమ ప్రాంతంలో వాతావరణ సూచనను తెలుసుకోవచ్చు.
 
దేశంలోని ఏ ప్రాంతమైన రైతు తన గ్రామం లేదా బ్లాక్ కోసం రాబోయే ఐదు రోజులలో వర్షం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం వంటి వాతావరణ సమాచారాన్ని పొందవచ్చు. ఐఎండీ ప్రత్యేక బృందం ఈ అప్లికేషన్‌పై పని చేస్తుంది.
 
ప్రస్తుతం రైతులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం కారణంగా వారు వాతావరణ సంబంధిత సమాచారాన్ని పొందలేరు. తాజా కొత్త పథకం కింద అందించే సమాచారం ఆ ప్రాంతానికి మరింత నిర్దిష్టంగా ఉంటుంది. తద్వారా ఇది రైతుకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments