Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందుగానే నైరుతి .. శుభవార్త వెల్లడించిన ఐఎండీ

Webdunia
ఆదివారం, 15 మే 2022 (14:16 IST)
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నాయి. భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు ఈసారి 4 రోజులు ముందుగానే వస్తాయని అంచనా వేసింది. అనేకంగా ఈ నెల 27వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది.
 
ఈ యేడాది ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెల్సిందే. పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్న వేళ భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. 
 
నైరుతు రుతుపవనాలు ఈసారి ముందుగానే వస్తున్నాయని తెలిపింది. ఈసారి రుతుపవనాలు మే 27న కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతవరణ శాఖ వెల్లడించింది. 
 
సాధారణంగా జూన్‌ 1న రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. ఒక్కోసారి జూన్ 10 కూడా అవుతుంది. ఈసారి 4 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తుండటం ఊరటనిచ్చే అంశం.
 
ఈసారి రుతుపవనాలతో దేశంలో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రైతులకు శుభవార్తే.
 
మే 22 నాటికే అండమాన్‌ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 15 వరకే బంగాళాఖాతం నైరుతి భాగానికి రుతుపవనాలు చేరుకోవచ్చునని తెలిపింది. జూన్ 1కి కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments