Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు గుడ్ న్యూస్.. మే19 నాటికి దేశంలోకి నైరుతి రుతుపవనాలు

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (11:28 IST)
monsoon
మండే ఎండల నుంచి ఉపశమనం కలుగనుంది. మే నెలల్లో ఎండలకు తాళలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది శుభవార్త. అలాగే దేశ రైతులకు ఇది గుడ్ న్యూస్. భారత రైతాంగానికి భారత వాతావరణ విభాగం తీపి కబురు చెప్పింది. 
 
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల్లోనే దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. సాధారణంగా ఏటా మే 22 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి క్రమంగా వారం, పది రోజుల్లో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించి కేరళ తీరాన్ని తాకుతాయి. 
 
కానీ, ఈసారి మూడు రోజులు ముందే.. మే 19 నాటికి చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది. జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
 
అయితే రుతుపవనాలు సకాలంలో దేశాన్ని తాకాలంటే అరేబియా సముద్రంలో వాతావరణం అనుకూలించాలని.. అరేబియా సముద్రంలో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితే నైరుతి రాకను జాప్యం తప్పదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments