Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకివ్వాలి : వరుణ్ గాంధీ

పని చేయని, హామీలు నెరవేర్చని ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకు ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు. గౌహతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ఎన్

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (07:33 IST)
పని చేయని, హామీలు నెరవేర్చని ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకు ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు. గౌహతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వారిని తొలగించే హక్కు ప్రజలకు ఇవ్వాలంటూ ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. 
 
ఇందుకోసం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని వరుణ్ సూచించారు. హామీలు నెరవేర్చని ప్రజా ప్రతినిధులను అభిశంసన తీర్మానం ద్వారా తప్పించే అవకాశం లభిస్తే 75 శాతం మంది ఎంపీలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. 
 
ఇకపోతే, తన ఇంటి పేరు కనుక గాంధీ కాకపోయి ఉంటే 29 ఏళ్లకే తాను ఎంపీని అయి ఉండేవాడినని గుర్తు చేశారు. ఇంటి పేరు ఏదైనా ప్రజలందరికీ సమానహక్కులు లభించాలన్నదే తన అభిమతమన్నారు. అటువంటి దేశాన్నే తాను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments