Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ మృతులకు పూలవర్షంతో వీడ్కోలు పలికిన స్థానికులు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (15:38 IST)
నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలో బుధవారం హెలికాఫ్టర్ కూలి ప్రాణాలు కోల్పోయిన మృతులకు స్థానికులు కన్నీటితో అంజలి ఘటించారు. భౌతికకాయాలు కలిగిన శవపేటికలను వారివారి స్వస్థాలకు తరలించేందుకు వ్యానుల్లో ఎక్కించి తరలించారు. ఆ వాహనాలు వచ్చిన రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన స్థానికులు పూలవర్షం కురిపిస్తూ, కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
కాగా, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ భౌతికకాయాలను నీలగిరి జిల్లా మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సులూర్ ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లలో తరలించారు. 
 
ఈ సందర్భంగా స్థానికులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. బిపిన్ రావత్, ఆయన అర్థాంగి, ఇతర సిబ్బంది భౌతికకాయాలను తీసుకెళుతున్న అంబులెన్స్‌లపై స్థానికులు పూలవర్షం కురిపించారు. అనంతరం వారి మృతదేహాలను సులూర్ ఎయిర్‌బేస్‌కు తరలించి, అక్కడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments