Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలిన భారత మిగ్‌ విమానం.. ఇద్దరు పైలట్ల మృతి.. పాక్ వాయుసేనకు చెక్

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:57 IST)
భారత వాయుసేన పాకిస్థాన్ భూభాగంలో దాడులు చేసిన నేపథ్యంలో భారత సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత సరిహద్దుల్లో భారత సైన్యాన్ని టార్గెట్ చేసి.. పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఒక యుద్ధవిమానం కూలిపోయింది.


భారత వాయుసేనకు చెందిన మిగ్‌ విమానం ఇదని సైనికాధికారులు చెప్తున్నారు. బుద్గాం జిల్లాలో గరెండ్‌ కలాన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. 
 
యుద్ధవిమానానికి చెందినదిగా భావిస్తున్న వీడియోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించారు. ఇకపోతే.. పాక్‌ యుద్ధవిమానాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చి బాంబులు జార విడిచి వెళ్లాయి. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పాక్‌ యుద్ధవిమానాల కదలికలపై ముందు నుంచే ఒక కన్నేసిన భారత వాయుసేన వెంటనే ప్రతిస్పందించింది. భారత్‌కు చెందిన యుద్ధవిమానాలు వాటిని అడ్డుకొనేందుకు వెళ్లాయి. భారత వాయుసేన విమానాల ప్రతిఘటనతో పాక్‌ విమానాలు తోకముడిచాయి. పూంచ్‌, రాజౌరీ సెక్టార్లలో ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయి. భారత్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన విమానాలు పాక్‌ ఎఫ్‌-16 విమానాలుగా భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments