Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరు మార్చుకున్న కరాచీ బేకరీ ఇకపై...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:50 IST)
ఉరుము ఉరిమి మంగళం మీద పడిందనేది పాత సామెత. పుల్వామా దాడుల నేపథ్యంలో పాక్ అంటేనే మండిపడుతున్న జనసామాన్యం ధాటికి కరాచీ బేకరీ కూడా తామేమీ అతీతులం కాదంటూ పేరు మార్చేసుకుంది.
 
వివరాలలోకి వెళ్తే... పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 'కరాచీ బేకరీ'లకు పేరు మార్చుకోవలసిందేనంటూ బెదిరింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ తమ బ్రాంచ్‌ల దగ్గర సెక్యురిటీని పెంచడంతో పాటు ఇది పూర్తిగా భారతీయ సంస్థేనని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. 
 
అయితే పేరు మార్పుపై కరాచీ బేకరీ యాజమాన్యం తాజాగా ఓ ప్రకటకన చేస్తూ... ఇకపై తమ సంస్థలకు 'ఇండియన్ కరాచీ'గా పేరు మారుస్తున్నట్టు తెలిపింది. మోజాంజాహి మార్కెట్‌ దగ్గర ఉన్న కరాచీ బేకరీ యాజమాన్యాన్ని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలోని బీజేపీ నేతలు సంప్రదించగా ఈ మేరకు హామీ ఇచ్చారు. 
 
రెండు రోజుల్లో ఇండియన్‌ కరాచీ బేకరీ పేర్లు పెడతామని యాజమాన్యం తెలిపినట్టు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు గొడుగు శ్రీనివాస్‌యాదవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా ఏమేమి మార్చాల్సి ఉంటుందో... చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments