ప్రధాని నరేంద్ర మోడీని చంపగలను : మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (08:52 IST)
తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపగలను, దూషించగలను అంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 
 
మహారాష్ట్రలో జిల్లా, పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన భండారా జిల్లాలోని లఖానీ తెహసీల్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను గత మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, సొంత నిధులతో ఎన్నో పాఠశాలలకు భవనాలు నిర్మించానని గుర్తు చేశారు. కానీ, ఒక్కదానికి కూడా తన పేరు లేదన్నారు. ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నానని చెప్పారు. 
 
పైగా తాను ప్రధాని మోడీని చంపగలను, దూషించగలనని అన్నారు. అందుకే ప్రధాని మోడీ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజాయతీ కలిగిన నాయకత్వానికి ఓటర్లు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments